HomeTelugu Trendingఓటీటీలో జాన్వీ ‘కార్గిల్ గర్ల్’

ఓటీటీలో జాన్వీ ‘కార్గిల్ గర్ల్’

Janhvi kapoor kargil girl m
అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ యుద్ధఫైలట్‌గా నటిస్తున్న చిత్రం ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. చిత్రంలో జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించగా, పంకజ్‌ త్రిపాఠి ఆమె తండ్రిగా, అంగద్‌ బేడీ సోదరుడిగా నటిస్తున్నారు. అమిత్‌ త్రివేది సంగీత స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 12న నెట్‌ ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన మూడు మోషన్‌ పోస్టర్లను జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారుకు ముందు రోజు జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేసింది. ‘గుంజన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గాళ్‌’ మూవీకి సంబంధించి ప్రత్యేకమైన ప్రయాణాన్ని మీ అందరితో పంచుకోవడానికి వేచి ఉండలేకపోతున్నా. ‌నా సస్పెన్స్‌కు నెట్‌ ఫ్లిక్స్ తొందరంగా ముగింపు ఇవ్వాలి’ అని కామెంట్‌ జతచేశారు. శరణ్‌ శర్మ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. ఈ సినిమాను చిత్ర బృందం మార్చి 13న విడుదల చేయాలనుకుంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 24కు వాయిదా వేశారు. కరోనా వైరస్‌ కారణంగా థియేటర్లు మూతపడటంతో విడుదల సాధ్యపడలేదు

Recent Articles English

Gallery

Recent Articles Telugu