టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జాతిరత్నాలు’. స్వప్న సినిమా బ్యానర్ లో అనుదీప్ కేవీదర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ టీజర్ శుక్రవారం విడుదలైంది. 65 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం వినోదాల విందు పంచుతూనే ఉంది. ఫుల్ లెంగ్త్ కామెడీ డ్రామా ‘జాతిరత్నాలు’లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. స్వప్న సినిమాస్ పతకంపై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. రాధన్ సంగీతం అందిస్తున్నారు. శివరాత్రి కానుకగా మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.