HomeTelugu Trending'కేజీఎఫ్ డైరెక్టర్'తో ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా మూవీ?

‘కేజీఎఫ్ డైరెక్టర్’తో ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా మూవీ?

4 5
టాలీవుడ్‌ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బీజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ తాజాగా ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమాతో సెట్స్ పైకి వెళ్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ డైరెక్టర్ తో సినిమా చెయనునట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరి కంబినేషన్ లో సినిమా చేయాలనీ మైత్రి మూవీ మేకర్స్ భావిస్తుందట. అయితే ఈ సినిమాకు సంబంధించి చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. అయితే ఇప్పటికే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ తరువాత సినిమా కూడా పాన్ ఇండియా సినిమా గానే ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే చూడాలి మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu