బాలీవుడ్ స్టార్ సింగర్ కనికా కపూర్కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. 15 రోజుల క్రిందటే ఇది జరిగింది. అయితే ఆ తర్వాత కూడా ఆమె మళ్లీ పార్టీలకు వెళ్లింది. దీనిపై కనికా కపూర్పై కేసు కూడా ఫైల్ చేసారు పోలీసులు. అయితే ఇదిలా ఉంటే పది రోజులుగా ఈమె ఉత్తరప్రదేశ్లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతుంది. ఇన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించింది. వరసగా నాలుగు సార్లు కరోనా పాజిటివ్ వచ్చినా.. ఇప్పుడు ఐదోసారి ఆమెకు నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు మరియు కుటుంబ సభ్యులు.
సాధారణంగా ఒకటి రెండు సార్లు చేసిన తర్వాత మూడోసారి కరోనా నెగిటివ్ అని వస్తుందంటున్నారు వైద్యులు. కానీ కనికా కపూర్ విషయంలో ఇది జగర లేదు. ఇప్పటికీ నాలుగుసార్లు పరీక్ష చేస్తే అన్నిసార్లు పాజిటివ్ అని రావడంతో ఏం చేయాలో తెలియక కంగారు పడ్డారు కుటుంబ సభ్యులు. అయితే ఇప్పుడు ఐదోసారి మాత్రం కరోనా నెగిటివ్ వచ్చింది. దాంతో కనికా కపూర్ ఆరోగ్యం కుదుటపడుతుందని చెబుతున్నారు డాక్టర్లు. గత రెండు వారాలుగా ఆమె లక్నో ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటుంది.