Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రొజెక్టర్ ‘కన్నప్ప’. ముఖేష్కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ప్రతిష్టత్మికగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే చాలా మంది స్టార్ నటీనటులు భాగమైన సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈసినిమా తెలుగు, హిందీ, తమిళంలో రూపొందుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో కనిపించబోతున్నాడు. నయనతార పార్వతీ దేవిగా, అక్షయ్ కుమార్ పరమశివుని పాత్రలో కనిపించబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.
తాజాగా అక్షయ్ కుమార్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మంచు విష్ణు కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో.. అదీ రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. అందుకే ఇంతమంది స్టార్స్ ని రంగంలోకి దింపుతున్నాడు మంచు విష్ణు.
అయితే.. ఈ ప్రాజెక్టు నుండి స్టార్ హీరోయిన్ నయనతార తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టు చెప్పిందట. దీంతో ఆమె స్థానంలో అంటే పార్వతీదేవి పాత్రకి గాను కాజల్ అగర్వాల్ ను తీసుకున్నట్లు ఇన్సైడ్ టాక్.
త్వరలోనే కాజల్.. కన్నప్ప షూటింగ్లో జాయిన్ కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా గతంలో మంచు విష్ణు – కాజల్ కాంబినేషన్లో ‘మోసగాళ్ళు’ అనే సినిమా వచ్చింది. ఇందులో మంచు విష్ణు- కాజల్ అక్కాతమ్ముల్లుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.