HomeTelugu Trendingముంబైలో ఆటో రిక్షాలో ఎంజాయ్ చేసిన కియారా..!

ముంబైలో ఆటో రిక్షాలో ఎంజాయ్ చేసిన కియారా..!

9a 3
కియారా అద్వానీ ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్‌లో భారీ హిట్ అందుకుంది. కబీర్ సింగ్ హిట్ తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో లక్ష్మి బాంబ్ సినిమాలో నటిస్తోంది. సౌత్‌లో సంచలన విజయం సాధించిన కాంచన సినిమాకు ఇది రీమేక్. లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.

ఓ రోజు షూటింగ్ పూర్తయ్యాక కియారా అద్వానీ.. తన కొరియోగ్రాఫర్‌తో కలిసి ఆటోలో ప్రయాణం చేసింది. ఆమె ప్రయాణం చేస్తున్నంత సేపు దారిలో కనిపించిన వాళ్లకు హాయ్ చెప్తూ వెళ్ళింది. ఇలా ఆటోలో ప్రయాణం చేయడం షూటింగ్‌లో భాగమా లేదంటే కారు బోర్ కొట్టి ఆటోలో వెళ్లిందా అన్నది ముంబై వాసులకు అర్ధంకాలేదట. ప్రస్తుతం ఆమె ఆటోలో ప్రయాణం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్‌: ప్రపంచంలోని అతి పెద్ద అడవులు, మనకు 20 శాతం ఆక్సిజన్‌ అందించే అడవులు, పది లక్షల మంది ప్రజలకు, లక్షలాది వన్యప్రాణులకు ఆధారమైన అడవులు.. కాలిపోతున్నాయి. దీని వల్ల వాతావరణంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఈ ఘటన నా హృదయాన్ని ఎంతో బాధిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu