HomeTelugu Trending200 కోట్ల క్లబ్‌లో మహశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు'

200 కోట్ల క్లబ్‌లో మహశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’

3 18
సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లతో బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. ఈ చిత్రం రూ.200 కోట్ల కబ్ల్‌లో అడుగుపెట్టిందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్ల కంటే (రియల్‌ టైమ్‌ గ్రాస్‌) ఎక్కువ రాబట్టిందని, బొమ్మ దద్దరిల్లిందని కామెంట్లు చేశారు. సినిమా పది రోజుల్లో కేవలం తెలుగు రాష్ట్రాల్లో రూ.101.97 కోట్లు (షేర్‌) రాబట్టినట్లు చెప్పారు. నైజాంలో రూ.33 కోట్లు, సీడెడ్‌లో రూ.14.65 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ.17.07 కోట్లు, గుంటూరులో రూ.9.03 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.10.06 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.6.57 కోట్లు, కృష్ణలో రూ.7.97 కోట్లు, నెల్లూరులో రూ.3.62 కోట్లు సాధించినట్లు అంచనా వేశారు.

ఈ సందర్భంగా చిత్ర బృందం కొత్త ప్రోమోను విడుదల చేసింది. ‘ఎవడ్ని ఎవడు వదలాలిరా..’ అంటూ మహేశ్‌ కొండారెడ్డి బురుజు వద్ద విలన్లను చిత్తు చేస్తున్న సన్నివేశాన్ని వీడియోలో చూపించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించగా.. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా విడుదలైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu