HomeTelugu Trending'సర్కారు వారి పాట'లో కైరా అద్వానీ?

‘సర్కారు వారి పాట’లో కైరా అద్వానీ?

4a
సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం లో బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అప్పటి నుంచీ మళ్లీ ఈ జంట ఎప్పుడు జోడీ కడుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కైరా మరోసారి మహేశ్‌కు జంటగా నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం తర్వాత మహేశ్ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్‌ పరశురాంతో చేస్తున్నాడు. దీనికి ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ని ఫిక్స్‌ చేశారు. ఇటీవలే దీని పూజా కార్యక్రమాలు జరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కైరా అద్వానీని తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో చిత్రం యూనిట్ ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతోందనీ, ఈ సినిమా పట్ల కైరా కూడా ఆసక్తి చూపుతోందని తాజా సమాచారం. తాను బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేసుకోనుందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu