HomeTelugu Trendingక్రిష్‌- అనుష్క కాంబో రిపీట్‌.. మరో వేదం అవుతుందా?

క్రిష్‌- అనుష్క కాంబో రిపీట్‌.. మరో వేదం అవుతుందా?

Krish all set to direct Anuటాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి సినిమాలకు కొంచెం దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. సైజ్‌ జీరో తరువాత ఆమె కెరీర్ లో వెనుకబడింది. ఈ సినిమా ఆమెకు సక్సెస్‌ ఇవ్వబోగా.. వెనక్కి నెట్టేసింది. ఆ తరువాత చాలా గ్యాప్‌ తరువాత అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తుంది.

ఇటీవలే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పర్వలేదు అని పించింది. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. ఈక్రమంలో తెలుగులో ఓ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఆ సినిమా కూడా ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ లోనే ఉండబోతుంది అని టాక్‌.

బాహుబలి తరువాత నుంచి అనుష్క చేస్తున్న తెలుగు సినిమాలు అన్ని యూవీ క్రియేషన్స్ లోనే ఉంటున్నాయి. ఇప్పుడు కొత్త సినిమాని కూడా యూవీ క్రియేషన్స్ లోనే చేయబోతున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారట. ప్రస్తుతం క్రిష్, పవన్‌ కళ్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్‌ డేట్స్ కోసం ఎదురుచుస్తున్నారు. ఇక పవన్ డేట్స్ ఇవ్వకపోవడంతో.. ఈ గ్యాప్‌లో ‘కొండపోలం’ అనే సినిమా డైరెక్ట్ చేసి రిలీజ్ కూడా చేసేశారు. ఇప్పుడు మరో మూవీని కూడా డైరెక్ట్ చేయడానికి సిద్దమవుతున్నారట.

అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ ఓ సినిమా చేస్తున్నరాట. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యినట్లు టాక్‌. ఇక ఈ మూవీని యూవీ క్రియేషన్స్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కాగా క్రిష్, అనుష్క కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ.. ఏ జోనర్ లో ఉండబోతుందో అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే గతంలో అనుష్క- క్రిష్ కాంబినేషన్‌లో ‘వేదం’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్ ప్రధాన పాత్రలలో నటించారు. అప్పటికే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న అనుష్క ఈ సినిమాలో వేశ్య పాత్రలో కనిపించింది. 2010లో విడుదలైన ఈ సినిమా పలు నంది అవార్డులను గెలుచుకుంది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu