HomeTelugu Trendingమీరా చోప్రా ఫిర్యాదుపై స్పందించిన మంత్రి కేటీఆర్

మీరా చోప్రా ఫిర్యాదుపై స్పందించిన మంత్రి కేటీఆర్

7 4
నటి మీరా చోప్రా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్‌ వేదికగా మాటల యుద్దం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై మీరాచోప్రా మరోసారి తెలంగాణ మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కవితకు ట్విటర్‌ ద్వారా తెలియచేశారు. ‘తనను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గ్యాంగ్‌ రేప్‌ చేస్తామని, యాసిడ్‌ దాడి చేస్తామంటూ బూతులు తిడుతున్నారని.. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.. ఇప్పటికే హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. మహిళలకు న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నా’ అంటూ ట్విట్టర్‌లో తెలిపారు .

నటి మీరాచోప్రా ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించారు.’ మేడం..ఈ విషయం నా దృష్టికి వచ్చింది. మీ ఫిర్యాదు ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ సీపీకి ఆదేశించాను.’ అని ట్విట్టర్‌లో తెలిపారు.

కేటీఆర్‌ ట్వీట్‌కు మీరాచోప్రా రీట్వీట్‌ చేస్తూ..’థాంక్యూ కేటీఆర్‌ సర్‌.. మహిళల భద్రతకు ఇది చాలా ముఖ్యం. మహిళలపై నేరాలకు పాల్పడుతున్న ఇలాంటి వ్యక్తులను స్వేచ్ఛగా ఉంచకూడదు!’ మీకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. మీరా చోప్రా ట్వీట్ల ఆధారంగా హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ట్విట్టర్‌లో చేసిన అసభ్యకరమైన ట్వీట్లను పోలీసులు తొలగించారు. అసభ్యంగా కామెంట్స్ చేసిన వారి ట్విట్టర్ ఖాతాలను గుర్తించి వారిపై 67 ఐటీ యాక్ట్, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇకపై ట్విట్టర్‌లో అసభ్యంగా ఉన్న పోస్టులను షేర్ చేసినా, వాటిపై కామెంట్ చేసినా వారిపై కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu