HomeTelugu Big Storiesవర్మ వాస్తవాలను చూపితే చాలు: లక్ష్మీపార్వతి!

వర్మ వాస్తవాలను చూపితే చాలు: లక్ష్మీపార్వతి!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ ను లక్ష్మీపార్వతి కోణంలో తెరకెక్కించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధీచిన ప్రధాన పాత్రధారుల ఎంపిక విషయంలో వర్మ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ పాత్రధారిని ఎంపిక చేసి శిక్షణకు పంపినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ బయోపిక్ ను రూపొందించే విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది లక్ష్మీపార్వతి. ఈ సినిమా తీయడానికి వర్మ.. ఎన్టీఆర్ కుటుంబీకులను కలవనని ప్రకటించాడు.

సాధారణంగా బయోపిక్స్ ను తెరకెక్కించే ముందు సదరు వ్యక్తిని సంప్రదించడం లేదా వారికి సంబంధించిన వారిని కలవడం జరుగుతుంటుంది. కానీ వర్మ అలా చేయనని స్పష్టం చేశాడు. ఈ విషయంపై స్పందించిన లక్ష్మీపార్వతి.. తనను వర్మ కలవకపోయినా.. పర్వాలేదని చెప్పింది.

ఒకవేళ వర్మ తనను కలిసి సినిమా చేస్తే నేను చెప్పినట్లుగా సినిమా చేశారనే అపవాదు వస్తుంది. కాబట్టి వర్మ నిజాలు చూపగలిగితే చాలు.. అంతకుమించి ఏది కోరుకోవడం లేదని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu