HomeTelugu Trendingఓటీటీలో విడుదలైన 'మహాసముద్రం'

ఓటీటీలో విడుదలైన ‘మహాసముద్రం’

maha samudram on ott

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించిన చిత్రం ‘మహాసముద్రం’. ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులకు ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది.

సుదీర్ఘ విరామం తర్వాత హీరో సిద్ధార్థ్ తెలుగు సినిమాలో నటించాడు. దీంతో ‘మహాసముద్రం’ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో అదితీరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా నటించారు. రావు రమేశ్‌, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. ఈ మూవీ తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu