HomeTelugu Big Storiesఎన్టీఆర్‌-మహేష్‌‘పూనకాల ఎపిసోడ్‌ లోడింగ్‌’

ఎన్టీఆర్‌-మహేష్‌‘పూనకాల ఎపిసోడ్‌ లోడింగ్‌’

Mahesh babu and ntr special

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న రియాల్టీ గేమ్‌ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. తాజాగా ఈ గేమ్‌ షోలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సందడి చేశారు. ఎన్టీఆర్‌ అడిగిన ప్రశ్నలకు ఫుల్‌ జోష్‌గా సమాధానాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ త్వరలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా సదరు ప్రోగ్రామ్‌ టీమ్‌.. ఓ స్పెషల్‌ పోస్టర్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

‘పూనకాల ఎపిసోడ్‌ లోడింగ్‌’ అని పేర్కొంది. దీంతో నెటిజన్లు.. ‘‘మేము కూడా ఇక్కడ వెయిటింగ్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ గేమ్‌ షోలో ఇప్పటివరకూ పలువురు స్టార్‌ సెలబ్రిటీలు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో గెలుచుకున్న మొత్తాన్ని వాళ్లందరూ ఏదో ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళం అందించారు. ప్రారంభ ఎపిసోడ్స్‌లో రామ్‌చరణ్‌ పాల్గొని అలరించారు. రాజమౌళి, కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌, సమంతలు సైతం ఈ స్టేజ్‌పై తళుక్కున మెరిసి.. ఎన్టీఆర్‌ ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో మహేశ్‌ ఎపిసోడ్‌ ప్రసారం కానున్న తరుణంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu