HomeTelugu Trendingఎన్టీఆర్‌ షోకి గెస్ట్‌గా సమంత!

ఎన్టీఆర్‌ షోకి గెస్ట్‌గా సమంత!

Samantha in evaru meelo kot

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నిర్వహిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో నిదానంగా ఫిల్మ్ స్టార్స్ పార్టిసిపేషన్ తో మరింత కలర్ ఫుల్ కాబోతోంది. తాజాగా ఈ షోకు ప్రిన్స్ మహేశ్ బాబు హాజరయ్యాడన్నది తెలిసిందే. మహేశ్ బాబు ఈ గేమ్ లో పాల్గొని ఎంత మొత్తం గెలుచుకున్నాడో తెలియదు కానీ, ఆ ఎపిసోడ్ ప్రసారం కాకముందే, సమంత సైతం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’కు హాజరైందనేది వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మేనేజర్ మహేంద్రతో కలిసి ఈ కార్యక్రమంలో అందుకున్న చెక్ ను చూపిస్తూ సమంత ఓ ఫోటో దిగింది. ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సమంత జంటగా ఇంతవరకూ నాలుగు సినిమాల్లో నటించారు. కాగా వీరిద్దరీ మధ్య చక్కటి కెమిస్ట్రీ ఉందనే అభిమానులంతా భావిస్తుంటారు. ఇక ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి సమంత హాజరయినప్పుడు వారి మధ్య సంభాషణ ఏ విధంగా సాగి ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా విడాకులకు సంబంధించి సమంత ఓ క్లారిటీకి వచ్చేసిన తర్వాత జరిగిన ఈ షో లో చైతన్య, సమంత అనుబంధం గురించి ఎన్టీఆర్ ఏమైనా ప్రశ్నలు అడిగారో లేదో తెలియదు కానీ, ఈ షో టీఆర్పీ మాత్రం సూపర్ గా పెరిగే ఛాన్స్ ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu