టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం రూ. 200 కోట్ల ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తైయిన తర్వతా మహేష్ బాబు.. తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు పయణమైన సంగతి తెలిసిందే. అక్కడ రెండు నెలలు ఉండే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే మహేష్ బాబు అమెరికా వెళ్లడానికి అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు. ఆయన మోకాలి ఆపరేషన్ జరగనుందట. శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన ‘ఆగడు’ సినిమా షూటింగ్ సమయంలో ఆయన కాలికి గాయమైందట. ఆ గాయం మహేష్ బాబును తీవ్రంగా బాధపెడుతున్నట్టు సమాచారం. ఆ చికిత్స కోసమే మహేష్.. అమెరికా వెళ్లినట్టు తెలుస్తుంది. అదే హైదరాబాద్లో చేయించుకుంటే.. మీడియాతో పాటు అభిమానుల హడావుడి ఉంటుంది కాబట్టి.. మహేష్ బాబు.. అమెరికాలోనే తన మోకాలికి చికిత్స తీసుకోనున్నట్టు చెబుతున్నారు. ఆపరేషన్ తర్వాత రెండు మూడు నెలలు పూర్తిగా విశాంత్రి తీసుకున్న తర్వాత వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.