HomeTelugu Big Storiesతండ్రి జ్ఞాపకార్థం మరో మంచి పనికి మహేష్‌ శ్రీకారం

తండ్రి జ్ఞాపకార్థం మరో మంచి పనికి మహేష్‌ శ్రీకారం

Mahesh Babu Launched The Su
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు రియల్‌గా కూడా శ్రీమంతుడే. మహేష్ బాబు ఇప్పటికే ఎంబీ ఫౌండేషన్ ద్వారా 2500 మందికి పైగా చిన్నారి గుండెలకు ఊపిరి పోశారు. ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించారు. బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అక్కడ విద్య,వైద్యం సదుపాయాలను కల్పించారు. ఇలా మహేష్ బాబు చేసే సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే.

తాజాగా మహేష్ బాబు మరో అడుగు ముందుకు వేశారు. సూపర్ స్టార్ కృష్ణ మొదటి వర్దంతి (నవంబర్ 15) సందర్భంగా మహేష్ బాబు ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. కృష్ణ పేరు మీదుగా ఎడ్యుకేషనల్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. తండ్రి జ్ఞాపకార్థం మహేష్ బాబు ఇలా పేద పిల్లలకు స్కాలర్ షిప్ ఇస్తూ ఉచితంగా విద్యను అందిస్తున్నారు.

మహేష్ బాబు చేపట్టిన ఈ మంచి కార్యక్రమానికి సోషల్ మీడియా నుంచి మంచి స్పందన లభిస్తోంది. నెటిజన్లు మహేష్ మంచితనాని ప్రశంసిస్తున్నారు.40 మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించే వరకు అయ్యే ఖర్చును ఎంబీ ఫౌండేషన్ భరించనుందని సమాచారం. ఈ మేరకు వారంతా కూడా మహేష్ బాబుకు థాంక్స్ చెప్పారు. మహేష్ బాబు గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తామని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu