HomeTelugu Trending‘సర్కారు వారి పాట’.. రిస్క్ వద్దంటున్న మహేష్.!

‘సర్కారు వారి పాట’.. రిస్క్ వద్దంటున్న మహేష్.!

4 10
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తాజాగా పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సందర్భంగా విడుదల చేసిన ‘ప్రీ లుక్ పోస్టర్‌’ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాను మహేష్‌ బాబు ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట. ఒకవేళ అదే నిజమైతే హీరోగా మహేష్ బాబు ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సుదీప్‌ను విలన్‌గా అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలు పెట్టనున్నట్టు తాజా సమాచారం.

కరోనా నేపథ్యంలో ఇప్పుడే షూటింగ్ ప్రారంభించి తనతో పాటు మూవీయూనిట్‌ను ఇబ్బందులు పాలు చేయకూడదనే మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమాలో ముందుగా కియారా అద్వానీ హీరోయిన్‌గా అనుకున్నారు. పలు కారణాలు వల్ల కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. మొత్తంగా పరిస్థితులు అన్ని చక్కబడ్డాకా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలి అని తొందరపడితే మంచిది కాదని మహేష్ బాబు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu