HomeTelugu Trendingఆ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్న మహేష్‌ బాబు!

ఆ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్న మహేష్‌ బాబు!

8 24
టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తరువాత ఇప్పటివరకు మరో సినిమాను ప్రకటించలేదు. అయితే డైరెక్టర్‌ పరశురామ్ తో మహేష్ సినిమా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ముందుగా చైతన్య తో పరశురామ్ సినిమా చెయ్యాల్సి వుంది. కానీ మహేష్ సినిమా కోసం చైతు ను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఇక పరుశురాం సినిమాను సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తుంది. మహేష్ కెరీర్‌ బిగెస్ట్ హిట్ గా నిలిచినా ‘పోకిరి’ సినిమా కూడా పధ్నాలుగేళ్ల క్రితం ఏప్రిల్ 28న విడుదలైంది. ఆ సెంటిమెంట్ కలిసివచ్చేలా విడుదల తేదీని ప్లాన్ చేసినట్లు సమాచారం. మరి ఈ సినిమా కూడా పోకిరి స్థాయి హిట్ అందుకుంటుందేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu