HomeTelugu Newsకత్తి మహేష్‌కు కరోనా.. శునకానందం మానుకోంటూ ఫైర్‌

కత్తి మహేష్‌కు కరోనా.. శునకానందం మానుకోంటూ ఫైర్‌

10 1
కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో.. ఫేక్‌ న్యూస్‌లు కూడా బాగానే పుట్టుకోస్తున్నాయి. తాజాగా నటుడు సినీ క్రిటిక్ కత్తి మహేష్ కు కరోనా అంటూ వార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ వార్తలు తన కంట పడటంతో కత్తి మహేష్ స్పందించాడు. తనకు కరోనా లేదని, తనకు కరోనా ఉందని వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. తాను మీడియాలో ఉన్నందున కొద్ది రోజుల క్రితమే మీడియా ప్రతినిధులు అందరికి టెస్టులు చేయించారని.. ఈ క్రమంలోనే తాను కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నానని నెగిటివ్ వచ్చిందని అన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తారని కత్తి మహేష్ ఫైర్ అయ్యాడు.

నాకు కరోనా అని ప్రచారం చేస్తున్న వారందరూ శునకానందం మానుకుని ప్రజలకు పనికొచ్చేపనులు చెయ్యాలని కోరారు. తన ఆరోగ్యం బాగానే ఉందని ఒకవేళ కరోనా వచ్చిన దానిబారి నుంచి నా ఆరోగ్యం నేను కాపాడుకుంటానని తెలిపారు. నాకు ఫోన్‌ చేసి నా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న మిత్రులకు నా ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో పోస్ట్ చేశారు కత్తి మహేష్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!