HomeTelugu Trending'సర్కారు వారి పాట' ప్రారంభం

‘సర్కారు వారి పాట’ ప్రారంభం

Mahesh sarkaru vaari paataసూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మైంట్‌, 14 రీల్స్ ప్లస్ సంస్థల నిర్మాణంలో యంగ్‌ డైరెక్టర్‌ పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. శనివారం కేపీహెచ్‌బీ కాలనీలోని కాశీ విశ్వనాధ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభం అయింది. మహేష్‌ కూతురు సితార ఫస్ట్ క్లాప్ కొట్టగా, నమ్రత కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తం షాట్‌ని కాశీ విశ్వనాధ స్వామి గుడిలో చిత్రీకరించారు. జనవరి నెల ఆరంభం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu