HomeTelugu Trendingట్రంప్‌పై మంచు లక్ష్మి సెటైర్‌

ట్రంప్‌పై మంచు లక్ష్మి సెటైర్‌

Manchu lakshmi satire on US
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలు వెల్లడి అవడంతో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. ట్రంప్ కంటే బైడెన్ అధిక స్థానాల్లో విజయం సాధించి విజయానికి చేరువయ్యారు. ట్రంప్ ఇక శ్వేతసౌధాన్ని విడిచి పెట్టాల్సిందేనని స్పష్టమవుతుండడం, అదే సమయంలో ఫలితాలు పూర్తి స్థాయిలో ఇప్పటికీ వెల్లడి కాకపోవడం వంటి అంశాలపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఎన్నో రకాల కార్టూన్లు, ఫొటోలు పోస్ట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. అయితే టాలీవుడ్ నటి, మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా ఓ గ్రాఫిక్స్ ఫొటోను పోస్ట్ చేస్తూ సెటైర్ వేసింది. ఇందులో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఓ భవంతి వెనుక నుంచి ముందుకు చూస్తూ ‘ఆయన ఇంకా వెళ్లిపోలేదా’ అని అడుగుతున్నట్లు ఉంది. ఈ ఫొటోను పోస్ట్ చేసిన మంచు లక్ష్మి #USElectionResults2020 హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu