టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న ‘మన్మథుడు 2’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే పోర్చుగల్ షెడ్యూల్ కూడా పూర్తి చేసిన టీమ్ త్వరలోనే హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనుంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్ఫీడ్ చూస్తుంటే సినిమా జూలై నాటికి పూర్తయ్యేలా కనిపిస్తోంది. దీంతో సినిమాను నాగార్జున పుట్టినరోజు ఆగష్టు 29కి విడుదలచేసే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.