HomeTelugu Trendingచిరంజీవిపై పరువునష్టం దావా వేసిన మన్సూర్ అలీఖాన్

చిరంజీవిపై పరువునష్టం దావా వేసిన మన్సూర్ అలీఖాన్

chiranjeevi defamation caseమెగాస్టార్ చిరంజీవితో పాటు, హీరోయిన్ త్రిష, ఖుష్బూపై తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ పరువునష్టం దావా వేశాడు. హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్ వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

‘లియో’ సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని తాను భావించానని, అలాంటి సన్నివేశం లేకపోవడంతో తాను చాలా డిజప్పాయింట్ అయ్యానంటూ చేసిన వ్యాఖ్యలు ఎంతో దుమారం లేపాయి.

మన్సూర్ వ్యాఖ్యలను చిరంజీవి, ఖుష్బూ కూడా తప్పుబట్టారు. వీరితో పాటు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, మాళవిక మోహనన్, తమిళ నటుల సంఘాలు కూడా మన్సూర్ వ్యాఖ్యలను ఖండించాయి.

చిరంజీవి, త్రిష, ఖుష్బూలు తన పరువుకు భంగం కలిగేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీరిపై మద్రాస్ హైకోర్టులో మన్సూర్ పరువునష్టం దావా వేశారు.

తాను అనని మాటల గురించి అనవసరంగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వీరి వ్యాఖ్యలతో సమాజంలో తన పరువుకు భంగం కలిగిందని తనకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలంటూ మన్సూర్ అలీఖాన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu