HomeTelugu Trendingదేవరకొండ 'మీకు మాత్రమే చెప్తా' టీజర్‌

దేవరకొండ ‘మీకు మాత్రమే చెప్తా’ టీజర్‌

7 4క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు నిర్మాతగా మారాడు. తనకి హీరోగా మొదటి అవకాశం ఇచ్చిన తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి కింగ్ ఆఫ్ ది హిల్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి దాని నుండి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే చిత్రాని నిర్మిస్తున్నాడు. పెద్దగా హడావిడి లేకుండానే ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. నూతన దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోకు మంచి రెస్పాన్స్ రాగా ఈరోజు కొద్దిసేపటి క్రితం టీజర్ విడుదల చేశారు.

ఈ సినిమాలో తరుణ్ భాస్కర్,అభినవ్ గోమటం లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ మూవీలో అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ టీజర్ లో హీరోయిన్ తరుణ్ భాస్కర్ ని మందు తాగుతావా ? అమ్మాయిలతో తిరుగుతావా ? లాంటి ప్రశ్నలు అడిగితే నోనో అలాంటిది ఏమీ లేదని చెబుతాడు. అయితే అదంతా అబద్దం అని తేలిపోయాక మీ లాంటి వాళ్లు బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేస్తారు…కాల్ హిస్టరీ డిలీట్ చేస్తారు…వాట్సప్ చాట్ డిలీట్ చేస్తారు… అన్నీ దాచేసి దరికిపోతే అప్పుడు చీటింగ్ కాదంటారు… అంటూ అనసూయ సీరియస్‌గా తరుణ్ కి క్లాస్ పీకుతుంది. అలా క్లాస్ పీకుతూ చెప్పిన డైలాగ్ టీజర్ లో హైలైట్ గా నిలిచింది. ఈ టీజర్‌ పై ఓ లుక్‌ వేయండి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu