HomeTelugu News'మిస్‌ ఇండియా' గా మహానటి

‘మిస్‌ ఇండియా’ గా మహానటి

9 21హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్‌ ఇండియా’. నరేంద్రనాథ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ పతాకంపై మహేష్‌ ఎస్‌ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. జగపతిబాబు, నవీన్‌ చంద్ర, రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, భానుశ్రీ మెహ్రా, సుమంత్‌, నదియా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ రివీల్‌ టీజర్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఇందులో కీర్తి సురేశ్‌ నాజూకుగా, స్టైలిష్‌గా కనిపించారు. చిత్రం షూటింగ్‌ దాదాపు విదేశాల్లో జరిగినట్లు ఈ ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చిత్ర బృందం పేర్కొంది. ఇది ‘మహానటి’ తర్వాత కీర్తి సురేశ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న సినిమాగా కావడం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu