HomeTelugu News'మిస్టర్' ఎనభై శాతం పూర్తి!

‘మిస్టర్’ ఎనభై శాతం పూర్తి!

వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్‌’. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), ‘ఠాగూర్‌’ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌ ఇందులో కథానాయికలు. ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ.. ”నా కెరీర్‌లో ఇది స్పెషల్‌ ఫిల్మ్‌గా నిలిచిపోతుంది. ఎందుకంటే.. ఎమోషన్స్‌కి, విజువల్స్‌కి, మ్యూజిక్‌కి స్కోప్‌ ఉన్న సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. అందుకు తగ్గట్టుగా ఈ సినిమా కథ కుదిరింది. అదే ఈ ‘మిస్టర్‌’. ఈ సినిమా కోసం చాలా చాలా ట్రావెల్‌ చేశాం. ముఖ్యంగా స్పెయిన్‌లోని అందమైన ప్రాంతాలు అర్కెంటే, బెనిడోరన్, లమంగా, సెవిల్లా, క్లాడిస్‌ బ్రిడ్జ్, వేజర్‌ వైట్‌ విలేజ్, టొలోరో, కాంబడాస్‌లలో చిత్రీకరణ జరిపాం. అలాగే స్విట్జర్లాండ్‌తో పాటు చిక్‌మంగళూరు, ఊటీ, హైదరాబాద్‌ పరిసరాల్లోని కొన్ని గ్రామాల్లో షూటింగ్‌ చేశాం. త్వరలో కేరళలో జరిపే షెడ్యూల్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. నా నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పూర్తి సహకారంతో నేను అనుకున్నది అనుకున్నట్లుగా తీయగలిగాను” అని అన్నారు.
నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌’ మధు మాట్లాడుతూ.. ”వరుణ్‌తేజ్‌ రేంజ్‌ పెంచే సినిమా ఇది. శ్రీను వైట్ల చాలా స్పెషల్‌ కేర్‌ తీసుకుని ఈ సినిమా చేస్తున్నారు. ఇప్పటికి 80 శాతం సినిమా పూర్తయింది. ఇంకా రెండు పాటలు, క్లైమాక్స్‌ చిత్రీకరించాల్సి ఉంది. ఏప్రిల్ 14న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం” అని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!