HomeTelugu Trendingచిరు, రామ్‌ చరణ్‌కు మోడీ ఆహ్వానం

చిరు, రామ్‌ చరణ్‌కు మోడీ ఆహ్వానం

4టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన కుమారుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఆహ్వానం వచ్చిందట. ఇటీవల బాలీవుడ్‌ సినీ ప్రముఖులను మోడీ ఢిల్లీకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో షారుక్‌ ఖాన్‌, ఆమీర్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కంగనా రనౌత్‌, ఏక్తా కపూర్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ తదితరులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని సినీ, టీవీ రంగాలు రూపొందించిన పలు సాంస్కృతిక వీడియోలను మోడీ విడుదల చేశారు. మోడీతో కలిసి కార్యక్రమంలో దిగిన ఫొటోలను సినీస్టార్స్‌ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇలా మోడీ కేవలం బాలీవుడ్‌ ప్రముఖుల్ని మాత్రమే పిలవడంతో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణాదిని నిర్లక్ష్యం చేశారని, ఇక్కడి వారిని కూడా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

తాజాగా ఇప్పుడు ఢిల్లీకి రమ్మని మోడీ నుంచి చిరు, చరణ్‌కు ఆహ్వానం వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు చరణ్‌ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘నేను, నాన్న ప్రధానిని కలవబోతున్నాం. త్వరలోనే ఇది జరుగుతుంది. ఎన్నికల హడావిడి పూర్తిగా తగ్గిన తర్వాత వెళ్తాం. ఈ సమావేశం కోసం మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అని ఆయన అన్నట్లు తెలిసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu