HomeTelugu Newsబాలయ్య ఇంటి ముందు పారిశుద్ధ్య కార్మికుల వినూత్న నిరసన

బాలయ్య ఇంటి ముందు పారిశుద్ధ్య కార్మికుల వినూత్న నిరసన

3 20టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై పారిశుద్ధ్య కార్మికులు భగ్గుమన్నారు. 220 మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తొలగించడంతో ఆగ్రహించిన వారు బుధవారం బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. హిందూపురంలోని ఆయన నివాసంలోకి దూసుకెళ్లి మున్సిపల్‌ కార్మికులు నిరసన తెలిపారు. జీవో 279ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. బాలకృష్ణ ఇంటి వద్ద పెద్ద ఎత్తున చెత్త వేసి వారు తమ నిరసన తెలిపారు. బాలకృష్ణ ఇంటిని కార్మికులు ముట్టడించడంతో పోలీసులు వారిని అడ్డుకొని ఈడ్చి పడేశారు. మరి కొందరు కార్మికులు పోలీసు వాహనాలకు అడ్డుపడ్డారు. రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు కార్మికులు గాయపడ్డారు. మున్సిపల్‌ కార్మికుల ఆందోళనలో పాల్గొన్న సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu