HomeTelugu Trendingసుధీర్ బాబు-కృతిశెట్టి సినిమాలో భాగమైన మైత్రీ మేకర్స్

సుధీర్ బాబు-కృతిశెట్టి సినిమాలో భాగమైన మైత్రీ మేకర్స్

Mythri as part of Sudheer

ఇటీవల ‘పుష్ప’ సినిమాతో మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా మరో ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నిర్మాణంలో మైత్రీవారు భాగస్వాములయ్యారు.

ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ .. అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ‘ఉప్పెన’ .. ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలతో హిట్ అందుకున్న కృతి శెట్టి చేస్తున్న మూడో సినిమా ఇది. అందువలన సహజంగానే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి త్వరలో ఫస్టులుక్ ను వదలనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu