యంగ్ హీరో నాగశౌర్య, రీతు వర్మ జంటగా ఓ సినిమా ప్రారంభమైంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ‘లక్ష్మీ సౌజన్య’ దర్శకురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. టాలీవుడ్కు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై చిత్ర యూనిట్కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
ఈ నెల19 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత తెలిపారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతమందిస్తున్నారు. నాగశౌర్య ఇటీవలే ‘అశ్వథ్థామ’ వంటి మంచి కంటెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు నాగశౌర్యనే కథను అందించడం విశేషం. సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్పై నాగశౌర్య తల్లి ఉష మూల్పురి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిఫరెంట్ కాన్పెప్ట్తో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా ఈ సినిమాలో రీతువర్మ క్యారెక్టర్ స్పెషల్గా ఉంటుందని దర్శక నిర్మాతలు పేర్కొంటున్నారు.