మెగా బ్రదర్, నటుడు, జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా వైరస్ను గుర్తు చేస్తూ మీడియాపై కామెంట్ చేశారు. ప్రజలకు సోకుతున్న కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తుందేమో కానీ, మీడియాకు పట్టిన వైరస్ వదిలేలా లేదని ఆయన ట్వీట్ చేశారు.
‘కరోనా వైరస్ ప్రజల కంటే మీడియాకే వేగంగా వ్యాపిస్తోంది. 90 శాతం మీడియా ఈ భయంకర వైరస్ బారిన పడింది. కానీ, మరణాల గురించి నిర్ధారణ కాలేదు. నిజమైన కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తుందని భావిస్తున్నాను. అయితే, మీడియాకు పట్టిన వైరస్ మాత్రం వదులుతుందన్న ఆశ లేదు’ అని అన్నారు. ఈ ట్వీట్పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
Coronavirus is spreading rapidly in Media than in public. 90% of the Media got infected with a deadly Virus… No confirmed deaths… Expecting real coronavirus to be controlled… But there is no hope of recovery for the virus affected by media!
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 5, 2020