అక్కినేని నాగచైతన్య ‘మజిలీ’ తరువాత ఆయన కొత్తదనం గల కథలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చేస్తున్నాడు చైతన్య. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయిపల్లవి ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది.
ఈ సినిమా తరువాత ‘బంగార్రాజు’ .. ‘నాగేశ్వరరావ్’ లైన్లో ఉన్నాయి. ఆ తరువాత సినిమాను కూడా చైతూ సిద్ధం చేసేశాడని అంటున్నారు. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. బీవీఎస్ రవి ఈ సినిమాకి కథను అందించినట్టుగా చెబుతున్నారు. గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ ‘మనం’ సినిమా చేశాడు. అఖిల్ తో ‘హలో’ చేసిన విక్రమ్ కుమార్, ఈ సారి చైతూను సెట్ చేయడం విశేషం.