HomeTelugu Trendingఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రారంభించే యోచనలో నాగార్జున

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రారంభించే యోచనలో నాగార్జున

Nagarjuna OTT Platform

కింగ్ నాగార్జున ఇప్పటి వరకు ఎన్నో రకాల బిజినెస్‌లు చేసి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రంగంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘ఆహా’ తో సక్సెస్ ఫుల్‌గా సాగిపోతున్నారు. భవిష్యత్తు అంతా డిజిటల్‌ రంగానిదే అనిపిస్తోంది. కరోనా కారణంగా ఓటీటీకి మంచి డిమాండ్ వచ్చింది. ప్రేక్షకులు కూడా దానివైపే మొగ్గుచూపుతున్నారు. ప్రేక్షకుల్లో ఓటీటీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. నాగార్జున ఇప్పటికే ఈ ప్రాజెక్టును చేపట్టాల్సింది అయితే కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దృష్ట్యా అది వాయిదా పడిందని అంటున్నారు. నాగ్ త్వరలోనే సొంతంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభించబోతున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu