HomeTelugu Trendingగౌతమ్ తెరంగేట్రంపై క్లారిటీ ఇచ్చిన నమ్రత శిరోద్కర్

గౌతమ్ తెరంగేట్రంపై క్లారిటీ ఇచ్చిన నమ్రత శిరోద్కర్

Sitara with mother

సినీ పరిశ్రమలో వారసుల సంప్రదాయం అన్ని చోట్లా ఎక్కువగా ఉంటుంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా వారసులుగా వచ్చిన హీరోలు, హీరోయిన్లు సత్తా చాటుతున్నారు.

టాలీవుడ్‌లో కృష్ణ నట వారసుడిగా వచ్చిన మహేశ్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగారు. తెలుగులో అగ్ర నటుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు గౌతమ్ తెరంగేట్రం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని మహేశ్ అభిమానులు ఆశిస్తున్నారు.

Gautam Ghattamaneni

గౌతమ్ ఎంట్రీపై మహేశ్ భార్య నమ్రత ఓ కార్యక్రమంలో స్పందించారు. ప్రస్తుతం గౌతమ్ దృష్టి చదువుపైనే ఉందన్నారు. చదువు పూర్తయ్యాకే సినిమాల్లోకి వస్తాడని చెప్పారు. మరోవైపు మహేశ్ గారాలపట్టి సితార కూడా నటనపై ఆసక్తి పెంచుకుంది.

సితార తనకు సినిమాల్లో నటించడం ఇష్టమని చెప్పింది. సితార ఇప్పటికే ఓ జువెలరీ యాడ్‌లో నటించింది. దానికి గాను వచ్చిన మొత్తం పాతితోషికాన్ని ఛారిటీ కోసం ఖర్చు చేసినట్టు తెలిపింది.

సరైన గైడెన్స్, మంచి మనుషుల సపోర్ట్ ఉంటే సినిమా ఇండస్ట్రీ ఎంతో అందమైన ప్రదేశం అని నమ్రత అంటున్నారు. చాలామందికి ఇండస్ట్రీపై సదభిప్రాయం లేదు. మా పిల్లలను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటాం. వాళ్లకు నచ్చిన పనిని చేయమని చెప్తాం.. అప్పుడే వాళ్లు ఆనందంగా ఉంటారు అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu