HomeTelugu Trendingకరోనాతో టాలీవుడ్‌ సినీ రచయిత కన్నుమూత

కరోనాతో టాలీవుడ్‌ సినీ రచయిత కన్నుమూత

Nandyala ravi dies with cor
ప్రముఖ సినీ రచయిత నంద్యాల రవి కరోనాతో కన్నుమూశారు. గత కొన్నిరోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు. నంద్యాల రవి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నంద్యాల రవి ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకున్న ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి ఇటీవల ఆయన కుటుంబానికి రూ.లక్ష విరాళంగా అందించారు. అదే విధంగా నిర్మాత రాధామోహన్‌ సైతం రూ.లక్ష ఆర్థికసాయం చేసిన విషయం విదితమే. రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా నటించిన ‘ఒరేయ్‌ బుజ్జిగా’ చిత్రానికి నంద్యాల రవినే రచయితగా పనిచేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu