HomeTelugu Newsకరోనా ఎఫెక్ట్‌: నారా రోహిత్‌ , సందీప్‌ కిషన్‌ విరాళాలు

కరోనా ఎఫెక్ట్‌: నారా రోహిత్‌ , సందీప్‌ కిషన్‌ విరాళాలు

10 25
యంగ్‌ హీరో నారా రోహిత్‌ కూడా కరోనాపై పోరాటం కోసం రూ. 30 లక్షల విరాళం ప్రకటించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. 10 లక్షల చొప్పున విరాళం అందజేయనున్నట్టు ఆయన తెలిపాడు. మరో రూ. 10 లక్షలను ప్రధాన మంత్రి సహాయ నిధికి ఇవ్వనున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారిపై యుద్ధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రోహిత్‌ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ను అందరూ తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశాడు. మనం పాటించే స్వీయ నియంత్రణే మనకు శ్రీరామరక్ష అని అన్నాడు. అందరం సమిష్టిగా పోరాడి కరోనా మహమ్మారిని తరిమికోడదామని పిలుపునిచ్చాడు.

కరోనా కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు ఆదుకునేందుకు మెగాస్టార్‌ చిరంజీవి మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన సీసీసీ మనకోసం నిధికి హీరో సందీప్‌ కిషన్‌ రూ. 3లక్షలు విరాళమిచ్చాడు. మరోవైపు తన వివాహ భోజనంబు రెస్టారెంట్లలో పనిచేస్తున్న 500 మందికి పైగా ఉద్యోగులకు సంబంధించిన బాధ్యతలను తీసుకుంటున్నట్టు చెప్పారు. మన పని మనం చేద్దాం, సురక్షితంగా ఉందామని పిలుపునిచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu