HomeTelugu Newsగోపీచంద్ షూటింగ్ పూర్తి చేసాడు!

గోపీచంద్ షూటింగ్ పూర్తి చేసాడు!

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆక్సిజన్” షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటోంది. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోగా.. అతి త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ.. “ముంబై, గోవా, సిక్కిం, చెన్నై లాంటి ప్రదేశాల్లో నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడకుండా “ఆక్సిజన్” చిత్రాన్ని రూపొందించాం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన “ఆక్సిజన్” ఆడియో మన తెలుగు ప్రేక్షకులకి ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇక జ్యోతికృష్ణ టేకింగ్ స్టాండర్డ్స్ విషయం సినిమా రిలీజయ్యాక ప్రేక్షకులకు అర్ధమవుతుంది. త్వరలోనే ఆడియోను విడుదల చేసి.. అనంతరం సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తాం” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu