HomeTelugu Big StoriesPadma Bhushan: విజయ్‌కాంత్‌కు పద్మభూషణ్‌.. సంతోషంలో ఫ్యాన్స్‌

Padma Bhushan: విజయ్‌కాంత్‌కు పద్మభూషణ్‌.. సంతోషంలో ఫ్యాన్స్‌

Padma Bhushan Award to Vija

Padma Bhushan: కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఈ సారి సినిమా రంగం నుంచి ప‌లువురు అవార్డులు అందుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి, వైజ‌యంతీ, బాలీవుడ్ న‌టుడు మిథున్‌ చ‌క్ర‌వ‌ర్తి, సింగ‌ర్ ఉషా ఉత‌ప్‌తో పాటు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్యారేలాల్ శ‌ర్మ ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డులు వచ్చాయి. వీరితో పాటు విజ‌య్ కాంత్‌కు ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డును కేంద్రం ప్ర‌క‌టించింది. మ‌ర‌ణానంత‌రం విజ‌య్ కాంత్ ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుకు ఎంపిక‌య్యాడు.

విజ‌య్ కాంత్ గ‌త ఏడాది డిసెంబ‌ర్ 28న క‌న్నుమూశాడు. అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌కు చాలా కాలంగా దూరంగా ఉంటోన్న విజ‌య్ కాంత్ చెన్నైలో తుది శ్వాస విడిచాడు. సినిమా రంగానికి ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గాను మ‌ర‌ణానంత‌రం కేంద్ర విజ‌య్ కాంత్‌కు ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డును ప్ర‌క‌టించింది. విజ‌య్ కాంత్‌కు ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు రావ‌డం ప‌ట్ల కోలీవుడ్ ప్ర‌ముఖులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. విజ‌య్ ఖాంత్‌కు ఘ‌న నివాళిగా ఇదంటూ పేర్కొంటున్నారు.

విజ‌య్ కాంత్ లాగే గ‌తంలో కొంద‌రు సినీ ప్ర‌ముఖుల‌ను మ‌ర‌ణానంత‌రం ప‌ద్మ అవార్డులు వ‌రించాయి. దిగ్గ‌జ గాయ‌కుడు ఎస్‌.పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం 2021లో ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డుకు ఎంపిక‌య్యాడు. బాలు చ‌నిపోయిన ఏడాది త‌ర్వాత అత‌డిని ప‌ద్మ‌విభూష‌ణ్‌తో కేంద్ర గౌర‌వించింది. ప్ర‌ముఖ సింగ‌ర్ వాణి జ‌య‌రాం 2023లో ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుకు ఎంపికైంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu