దీపావళి పండుగ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బహుమతులు పంపారు. పవన్ పంపిన బహుమతుల బాక్స్ లో స్వీట్స్ తో పాటు, పర్యావరణహిత పటాసులు ఉన్నాయి.
ఈ విషయాన్ని మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. పవన్, అన్నా లెజినోవా దంపతులు గిఫ్టులు పంపారని చెప్పారు. ‘థాంక్యూ అన్నా అండ్ పవన్. హ్యాపీ దివాలీ’ అంటూ ధన్యవాదాలు తెలిపారు. ముందు నుంచి కూడా పవన్ కల్యాణ్, మహేశ్ బాబుల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. మహేష్ తో పాటు.. దర్శకులు క్రిష్, హరీశ్ శంకర్ లకు కూడా పవన్ గిఫ్టులు పంపారు.