HomeTelugu Trendingనిర్భయ దోషుల ఉరిపై మహేష్‌, రవితేజ ట్వీట్స్‌

నిర్భయ దోషుల ఉరిపై మహేష్‌, రవితేజ ట్వీట్స్‌

10 17
నిర్భయ దోషుల ఉరిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ కేసులో న్యాయం కాస్త ఆలస్యంగా గెలిచింది కానీ చివరికి గెలిచింది న్యాయమే అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మంది సెలబ్రిటీస్ తమ మనసులో మాట వెల్లడించారు. నిర్భయ దోషులను ఉరి తీయడంపై సూపర్ స్టార్ తనదైన శైలిలో స్పందించాడు. చాలా ఏళ్లుగా వేచి చూస్తున్న న్యాయం ఇప్పటికీ జరిగింది. నిర్భయ కేసులో జరిగిన తీరుతో మరోసారి న్యాయ వ్యవస్థపై అందరికీ నమ్మకం వచ్చిందని ట్వీట్ చేసాడు సూపర్ స్టార్. న్యాయం కోసం రేయింబవళ్లు పోరాడిన నిర్భయ తల్లిదండ్రులకు సెల్యూట్ చేసాడు మహేష్. మన న్యాయ వ్యవస్థను అంతా గౌరవించాలని కోరుకున్నాడు సూపర్ స్టార్. ఇప్పటికీ కొన్ని దారుణాలు జరిగినపుడు వెంటనే అమలయ్యే శిక్షలు ఉండేలా న్యాయ వ్యవస్థలో మార్పులు చేయాలేమో అంటున్నాడు. ఏదేమైనా కూడా న్యాయం గెలిచినందుకు ఆనందంగా ఉందని చెప్పాడు.

మాస్‌ మహరాజా రవితేజ కూడా ఈ విషయంపై స్పందించారు. “నిర్భయ దోషులకి ఉరి వేసారన్న వార్త నమ్మశక్యంగా లేదు. ఏడు సంవత్సరాల తరువాత, నిర్భయ కేసు దోషులు చివరకు ఉరితీయబడ్డారు.. న్యాయం కోసం చాలా సంవత్సరాలు అవిశ్రాంతంగా పోరాడిన తల్లి .. న్యాయవాదికి నేను వందనం చేస్తున్నాను” అని రవితేజ తన ట్విట్‌ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu