జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతి రైతులు ను కలిశారు. రాజధాని సమస్యలపై పోరాటానికి మద్దతు ఇవ్వాలని పవన్ను రైతులు కోరారు. రాజధాని అమరావతి నుంచి మారుతుందని వైసీపీ నేతల ప్రచారంతో రాజధాని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని ముంపు పేరుతో జరుగుతున్న అసత్య ప్రచారంపై రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కౌలు చెల్లించలేదని రాజధాని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.