HomeTelugu Trendingపునీత్‌ రాజ్‌ కుమార్‌పై ప్రభాస్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

పునీత్‌ రాజ్‌ కుమార్‌పై ప్రభాస్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Prabhas emotional post on p

కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ విడుదల రెడీ అవుతుంది. మార్చి17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న జేమ్స్‌ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేసింది మూవీ యూనిట్‌. ఈ నేపథ్యంలో పునీత్‌ను గుర్తు చేసుకుంటు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్‌ చేశాడు. ఈ సందర్భంగా జేమ్స్‌ మూవీలోని పునీత్‌ పోస్టర్‌ను షేర్‌ చేశాడు ప్రభాస్‌.

ఈ పోస్ట్‌లో ప్రభాస్‌ ‘మ్జేమ్స్’ రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సర్‌ని అభిమానించే లక్షలాది మందికి ఈ చిత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. వీ మిస్ యూ సర్’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే ప్రభాస్‌ తాజాగా నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం మార్చి 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాగా పునీత్‌ రాజ్‌కుమార్‌ గతేడాది అక్టోబర్‌ 29న గుండెపోటుతో మరణించారు విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!