HomeTelugu Trending'మా' ఎన్నికలపై ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు

‘మా’ ఎన్నికలపై ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు

Prakash raj tweet on maa el

‘మా’ ఎన్నికలు ముగిసి దాదాపు రెండు వారాలు అవుతుంది. మా నూతన అద్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ ‘మా’ ఎన్నికల వివాదాలు సద్దుమణగడం లేదు. ‘మా’ ఎన్నికల్లో వైసీపీ జోక్యం ఉందంటూ శుక్రవారం మధ్యాహ్నం నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల పోలింగ్‌ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన ప్రకాశ్‌రాజ్‌ తాజాగా కృష్ణమోహన్‌కు లేఖ రాశారు.

ఎన్నికల హాల్‌లోకి వైసీపీ కార్యకర్త నూకల సాంబశివరావుని ఎలా అనుమతించారంటూ? ప్రశ్నల వర్షం కురిపించారు. సాంబశివరావు ఎన్నికల హాల్‌లోని ఓటర్లను బెదిరించారంటూ.. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రకాశ్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో మంచు విష్ణుతో సాంబశివరావు ఉన్న కొన్ని ఫొటోలను కృష్ణమోహన్‌కు పంపించారు. అంతేకాకుండా జగ్గయ్యపేటకు చెందిన సాంబశివరావుపై క్రిమినల్‌ కేసులు కూడా ఉన్నాయని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. మరోవైపు, ఈ వీడియోలను అతి త్వరలో బయటపెడతానని ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన తాజాగా ట్వీట్‌ చేశారు.

‘కృష్ణమోహన్‌ గారు.. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పటికైనా మాకు సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వండి. ఎన్నికల ఎలా జరిగాయి.. పోలింగ్‌ బూత్‌లో అసలేం జరిగిందో ప్రపంచానికి తెలియజేయనివ్వండి’ అని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu