ఫిల్మీం ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ తన జీవితం రాజకీయాలకే అంకితం ఇప్పటికే ఎన్నోమార్లు చెప్పాడు. అయితే, గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తరువాత తిరిగి సినిమాల్లోకి వస్తారని వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ మాత్రం ససేమిరా అంటున్నారు. సినిమాల్లోకి అడుగుపెట్టనని మరోమారు స్పష్టం చేశారు.
అయితే, పవన్ తో సినిమా చేయడానికి అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలు మాత్రం పవన్ తప్పకుండా సినిమా చేస్తారని అంటున్నారు. ఇలా పవన్ తో సినిమా చేయాలని ఆసక్తి చూపుతున్న వ్యక్తుల్లో ఏఎం రత్నం ఒకరు. ఒకప్పుడు ఆయన టాప్ నిర్మాత. శంకర్ సినిమాలకు ఆయనే ప్రొడ్యూస్ చేసేవారు. కాగా, పవన్ తో సినిమా చేయాలని గతంలో అడ్వాన్స్ కూడా ఇచ్చారు. పవన్ తో సినిమా చేయాలని రత్నం పట్టుబడుతున్నాడు. క్రిష్ చెప్పిన కథ నచ్చడంతో ఆ స్క్రిప్ట్ పట్టుకొని పవన్ చుట్టూ తిరుగున్నాడట. కథ వినాలని, ఈ రాజకీయాలకు సంబంధించిన కథ అని, తప్పకుండా నచ్చుతుందని అంటున్నాడు. ఎలాగైనా పవన్ ఒప్పించి సినిమా చేస్తానని పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తున్నాడు నిర్మాత ఎఎం రత్నం.