హీరో రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్కు జంటగా నిధి అగర్వాల్, నభా నటేశ్ నటించారు. మణిశర్మ స్వరాలను సమకూర్చారు. ఈ ఏడాది జులై 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రామ్ మాస్ హీరోగా ప్రేక్షకులను అలరించారు. శుక్రవారంతో ఈ సినిమా విడుదలై 100 రోజులైన సందర్భంగా రామ్ సోషల్మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
‘ఇస్మార్ శంకర్ అనేది సినిమా మాత్రమే కాదు. నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం. ఈ సినిమాలోని శంకర్ పాత్రను నేను బాగా ఎంజాయ్ చేశాను. నా కెరీర్లో ఇంతటి మంచి చిత్రాన్ని నాకు అందించిన పూరీ జగన్నాథ్కు ధన్యవాదాలు. మీతో కలిసి పనిచేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమాకు సంగీతం అందించిన మణిశర్మతోపాటు ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం పనిచేసిన ఛార్మి, నిధి అగర్వాల్, నభా నటేశ్కు ధన్యవాదాలు. మా చిత్రబృందానికి మంచి హిట్ అందించిన నా అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు.’ అని రామ్ పేర్కొన్నారు.
రామ్ పెట్టిన పోస్ట్పై స్పందించిన దర్శకుడు పూరీ జగన్నాథ్ ట్విటర్ వేదికగా ‘మిస్ యూ రామ్.. నా జీవితంలో ఒక స్పెషల్ సినిమా ఇస్మార్ట్ శంకర్. లవ్ యూ. మనం మరొకసారి కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను.’ అని పోస్ట్ పెట్టారు. మరోవైపు ఛార్మి సైతం ట్విటర్ వేదికగా ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘ఈ వీడియో చూస్తే నాకు కన్నీళ్లు వస్తున్నాయి. కలల ప్రాజెక్ట్గా మేము ఈ చిత్రాన్ని ప్రారంభించాం. ఈ చిత్రం కోసం మా జీవితాలను అంకితం చేశాం. ప్రస్తుతం మేము వెనక్కి తిరిగి చూసుకుంటే ‘మా కల నిజమైంది’ అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం.’ అని ఛార్మి తెలిపారు.
Missing you ram .. a special film in my life. Lov you for everything . We need to rock again 💪🏽💪🏽💪🏽💪🏽💪🏽 https://t.co/RIK3cMaiI8
— PURIJAGAN (@purijagan) October 25, 2019