HomeTelugu Newsకరోనాతో ఫైట్‌ చేయాలంటే ఇంట్లోనే ఉండాలి: పీవీ సింధు

కరోనాతో ఫైట్‌ చేయాలంటే ఇంట్లోనే ఉండాలి: పీవీ సింధు

3 3

ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు ‘ఇంట్లోనే ఉందాం.. కరోనాను ఎదుర్కొందాం’ అని పిలుపునిచ్చారు. ఆమె ఇటీవల విదేశాల్లో బ్యాడ్మింటన్‌ టోర్నీలో పాల్గొని స్వదేశం రాగానే స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. నిన్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దేశంలోని 40 మంది ప్రముఖ క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కరోనా పరిస్థితిపై చర్చించారు. క్రీడాకారులంతా వారి సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా కొవిడ్‌-19కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో పీవీ సింధు ..కరోనాపై వీడియో సందేశాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

”బ్యాడ్మింటన్‌ కోర్టులోనే ఆడాలి.. అప్పుడే గెలుస్తాం. కరోనాతో ఫైట్‌ చేయాలంటే మనం ఇంట్లోనే ఉండాలి. భౌతికదూరం పాటిస్తేనే కొవిడ్‌-19పై విజయం సాధించగలం. మనకు సహాయం అందించడానికి 104 హెల్ప్‌లైన్‌ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ సూచనలు పాటిద్దాం. ఇంట్లోనే ఉందాం.. కరోనాను కలిసి ఎదుర్కొందాం” అని ప్రజలకు పిలుపునిచ్చారు పీవీ సింధు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu