HomeTelugu Trendingతమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రజినీకాంత్ విరాళం

తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రజినీకాంత్ విరాళం

Rajinikanth donates 50 lakh
త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌లిశారు. త‌మిళ‌నాడులో కరోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతోన్న నేప‌థ్యంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ర‌జ‌నీకాంత్ రూ.50 లక్షల సాయం అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును స్టాలిన్‌కు ఆయన అందజేశారు. కాగా ఇప్పటికే త‌మిళ హీరోలు పెద్ద ఎత్తున ముందుకు వ‌చ్చి క‌రోనా సాయం అందిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే సూర్య‌-కార్తి రూ.కోటి అందించారు. అలాగే, అజిత్‌, శివ‌కార్తికేయ‌న్ రూ.25 ల‌క్ష‌ల చొప్పున విరాళాలు అందించారు. కాగా, ర‌జ‌నీకాంత్ 35 రోజుల పాటు హైద‌రాబాద్‌లో అన్నాత్తె షూటింగ్ చేయ‌గా, తాజాగా ప్ర‌త్యేక ఫ్లైట్‌లో హైద‌రాబాద్ నుండి చెన్నైకు వెళ్లారు. ఈ రోజు వీలు చూసుకొని సీఎంను క‌లిసి విరాళం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu