HomeTelugu Big Storiesఈ ఏడాది చాలా నేర్చుకున్నాం: రామ్‌ చరణ్‌

ఈ ఏడాది చాలా నేర్చుకున్నాం: రామ్‌ చరణ్‌

Ram charan launches shootou

మనందరికీ ఈ ఏడాది చాలా కష్టంగా గడిచింది. ఈ ఏడాది చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు చిత్ర పరిశ్రమ మళ్లీ తన కాళ్ల మీద నిలబడింది’’ అన్నారు రామ్‌చరణ్‌. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి కుమార్తె, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణు ప్రసాద్‌ నిర్మించిన ఈ సిరీస్‌ ఈ నెల 25నుంచి జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ‘ఓయ్‌’ ఫేం ఆనంద్‌ రంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌లో శ్రీకాంత్‌, ప్రకాష్‌రాజ్‌, తేజ, నందినిరాయ్‌ కీలక పాత్రల్లో నటించారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో రామ్‌ చరణ్‌ ఈ సిరీస్‌ షో రీల్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఓయ్‌’ చాలా అందమైన సినిమా. కొన్ని నెలల పాటు ఆ సినిమా పాటలు వినేవాణ్ణి. మా అక్క, బావతో (సుష్మిత – విష్ణుప్రసాద్‌) ఆయన అసోసియేట్‌ అయి ఈ సిరీస్‌ చేయడం సంతోషంగా ఉంది. ఈ ఏడాది ఎలా మొదలైందనేది కాదు… ఎలా ముగిసిందనేది చాలా ముఖ్యం. ‘షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేరు’తో మంచి ఎండింగ్‌ ఇస్తామని ఆశిస్తున్నా. ‘రంగస్థలం, ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాలకు అక్క స్టైలీస్ట్‌గా చేసింది. కొత్త (ఓటీటీ) విభాగంలో అక్క ఫైటర్‌ అని చెప్పవచ్చు’’ అన్నారు.

‘‘ఓటీటీలో ఈ సిరీస్‌ గేమ్‌ చేంజర్‌ అవుతుందని ఆశిస్తున్నా. ప్రసాద్‌ నిమ్మకాయలగారి మార్గదర్శకత్వం లేకపోతే ఇంత దూరం వచ్చేవాళ్లం కాదు’’ అన్నారు విష్ణు ప్రసాద్‌. సుష్మిత మాట్లాడుతూ – ‘‘మనమే ముందుకు వెళ్లి అవకాశాల కోసం చూడాలనీ, అవి వచ్చినప్పుడు తీసుకోవాలని నాన్నగారు చెబుతుంటారు. అటువంటి స్ఫూర్తి ఇవ్వడంతో పాటు కొండంత అండగా నిలబడిన నాన్నగారికి థ్యాంక్స్‌’’ అన్నారు. డైరెక్టర్‌ నందినీరెడ్డి సినిమాటోగ్రాఫర్‌ అనిల్‌ బండారి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ నరేష్‌ కుమారన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శరణ్య తదితరులు పాల్గొన్నారు.

Ram charan launches

Recent Articles English

Gallery

Recent Articles Telugu