HomeTelugu Trendingఈడీ విచారణకు హాజరైన రానా

ఈడీ విచారణకు హాజరైన రానా

Rana attends for investigat
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో హీరో రానా దగ్గుబాటి ఈడీ విచారణ కొనసాగుతుంది. డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తోపాటు సినీ ప్రముఖులు పూరీ, ఛార్మి, రకుల్‌, నందులను విచారించిన అధికారులు వారి వద్ద నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. విచారణలో భాగంగా బుధవారం ఉదయం హీరో రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యారు. తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

Rana 1

మనీ లాండరింగ్‌ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. కెల్విన్‌తో ఉన్న పరిచయాలు, ఎఫ్‌ క్లబ్ గురించి అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నేడు రానాతోపాటు నటి ముమైత్‌ ఖాన్‌ని సైతం అధికారులు విచారించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu