HomeTelugu Big Storiesసరోగసీ కంటే దత్తతే మేలు.. కంగనా సోదరి సంచలన వ్యాఖ్యలు

సరోగసీ కంటే దత్తతే మేలు.. కంగనా సోదరి సంచలన వ్యాఖ్యలు

9 19
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సరోగసీ(అద్దె గర్భం) పద్ధతిలో రెండోసారి తల్లైన తెలిసిందే. శిల్పాశెట్టి, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు ఇప్పటికే వియాన్ అనే కొడుకు ఉండగా…ఈ నెల 15న సరోగసీ ద్వారా తమకు ఆడబిడ్డ జన్మించినట్లు వారు సోషల్ మీడియా ద్వారా శుక్రవారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో సంతానం కోసం సరోగసీ పద్ధతిని ఎంచుకోవడం సరికాదంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలి పేర్కొంది. సరోగసీ పద్ధతిలో సంతానం పొందడం కంటే…తల్లిదండ్రులు లేని పిల్లలను దత్తత తీసుకోవటమే మంచిదని సూచించింది. ఇప్పటికే తనకు ఓ బిడ్డ ఉండగా…త్వరలోనే ఓ ఆడబిడ్డను దత్తత తీసుకోవాలని తాను, తన భర్త అజయ్ నిర్ణయించుకున్నట్లు తెలిపింది. సంతానం కోసం దంపతులు సరోగసీ కంటే దత్తతనే ఎంచుకోవాలని, తద్వారా ఇప్పటికే భూమిపై ఉన్న తల్లిదండ్రులు లేని వారికి ఆశ్రయం కల్పించినట్లు అవుతుందని పేర్కొంటూ వరుస ట్వీట్స్
చేసింది.

ఈ విషయంలో తన సోదరి కంగనానే తమకు స్ఫూర్తిని కలిగించినట్లు రంగోలి తెలిపింది. ఆడబిడ్డను దత్తత తీసుకునేందుకు తన భర్త అజయ్ ఇప్పటికే అన్ని విధి విధానాలు పూర్తిచేసినట్లు వెల్లడించింది. మరికొన్ని మాసాల్లోనే ఆడబిడ్డ తమ వద్దకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. కంగనా ఆ బిడ్డకు గంగ అనే పేరు కూడా నిర్ణయించినట్లు తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu